రాజధానిపై కీలక తీర్పు.. రైతు గెలిచాడు.. అమరావతి నిలిచింది..! (Live Updates)
ABN, First Publish Date - 2022-03-03T17:57:32+05:30
ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది.
విజయవాడ: ‘రైతు గెలిచాడు.. అమరావతి నిలిచింది’.. 807 రోజులుగా ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అమరావతిపై గురువారం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వెలగపూడి గ్రామానికి చెందిన రైతులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తమ ఉద్యమానికి మద్దుతుగా నిలిచిన వివిధ పార్టీల నేతలు, మీడియాకు పాదాభివందనాలు తెలిపారు. హైకోర్టు తీర్పుతోనైనా జగన్ ప్రభుత్వం మారాలని, సీఆర్డీయే చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని జగన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు తాము పండుగలు చేసుకోలేదని, ఈ రోజే తమకు పండగ రోజని రైతులు పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలదని అన్నారు.
కాగా.. ఈ కీలక తీర్పుపై పలు పార్టీల రాజకీయ నేతలు, అమరావతి రైతులు, రైతు సంఘాల నాయకులు ఏమేం మాట్లాడారో ఇప్పుడు లైవ్ అప్డేట్స్లో చూద్దాం.
చరిత్ర హీనుడిగా జగన్.. ఈ విజయం 5 కోట్ల మంది ప్రజలది: చంద్రబాబు (18:02PM)
---------
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతించిన చంద్రబాబు (17:35PM)
---------
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: రేణుకాచౌదరి (16:38PM)
---------
రాజధానిపై 307 పేజీల తీర్పు ఇచ్చిన హైకోర్టు (16:18PM)
---------
అమరావతి రైతులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి: నాదెండ్ల మనోహర్ (16:10PM)
---------
‘ఊ అంటావా రెడ్డీ ఉ..ఊ అంటావా రెడ్డీ’... హైకోర్టు తీర్పుపై ఎంపీ రఘురామ (14:34PM)
---------
హైకోర్టు తీర్పుపై మోదుగుల సంచలన వ్యాఖ్యలు (14:06PM)
---------
పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగించాలి: Dhulipalla (01:10PM)
---------
జగన్ మనసు మార్చుకోవాలి: ప్రత్తిపాటి (12:28PM)
---------
ఇది అమరావతి రైతుల నైతిక విజయం : Sharif (12:02PM)
---------
రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలి (11:54AM)
---------
హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం :Yanamala (11:29AM)
Updated Date - 2022-03-03T17:57:32+05:30 IST