అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: రేణుకాచౌదరి
ABN , First Publish Date - 2022-03-03T22:08:33+05:30 IST
అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి రేణుకాచౌదరి ప్రకటించారు.
హైదరాబాద్: అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి రేణుకాచౌదరి ప్రకటించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతుల పోరాటానికి కోర్టు తీర్పుతో సరైన న్యాయం జరిగిందని తెలిపారు. ‘‘అమరావతి రైతులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. అమరావతిలో న్యాయం గెలిచింది. రైతుల పోరాటంతోనే ఇది సాధ్యమైంది. మహిళలు సైతం పోరాటంలో గట్టి పోరాటపటిమ చూపించారు. తిరుమల వెంకన్న, కనకదుర్గ ఆశీస్సులు అమరావతి రైతులకు ఉన్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్తే .. రైతుల తరుపున మేము కూడా అప్పీల్కు వెళ్తాం’’ అని రేణుకాచౌదరి ప్రకటించారు.