అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-03-03T23:05:48+05:30 IST

అమరావతిపై హైకోర్టు తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. 807 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళన చేశారని తెలిపారు.

అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతించిన చంద్రబాబు

అమరావతి: అమరావతిపై హైకోర్టు తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. 807 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళన చేశారని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిపై కుట్రలు చేశారని, అమరావతిని శ్మశానం అన్నారని తెలిపారు. రాజధాని రైతులు పవిత్రమైన పాదయాత్ర చేశారని ప్రశంసించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు పోరాటం ఆపలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విజయం ప్రజా రాజధానిది, 5 కోట్ల ఆంధ్రులదని చెప్పారు. అమరావతి అభివృద్ధి చెందితే విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు కాదని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2022-03-03T23:05:48+05:30 IST