Justice Rohinton Nariman: వివాదాల పరిష్కారాలకు మధ్యవర్తిత్వం దోహదం
ABN, Publish Date - Feb 16 , 2025 | 03:52 AM
న్యాయపర వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ పద్ధతిలో మధ్యవర్తిత్వం ఎంతగానో దోహదపడుతుందని సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ అన్నారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ నారిమన్
శామీర్పేట, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): న్యాయపర వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ పద్ధతిలో మధ్యవర్తిత్వం ఎంతగానో దోహదపడుతుందని సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్ అన్నారు. శామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కాం్యప్సలో నూతనంగా ఏర్పాటు చేసిన మిలోన్ కే బెనర్జీ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎంకేబీఏసీ)ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కోర్టుల బయట మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ ద్వారా వివాదాల పరిష్కారానికి ఆదరణ లభిస్తోందని తెలిపారు. మధ్యవర్తిత్వ రంగంలో మిలోన్ బెనర్జీ గణనీయమైన కృషి చేశారని గుర్తు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌషుమి భట్టాచార్య ప్రసంగిస్తూ మిలన్ బెనర్జీ కూమారుడు గౌరవ్ బెనర్జీ ఇచ్చిన విరాళం ద్వారా ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు.
Updated Date - Feb 16 , 2025 | 03:52 AM