Andhra Pradesh: ఏపీకి కేంద్రం వరాల జల్లు..
ABN, Publish Date - Feb 01 , 2025 | 04:37 PM
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ లో ఏపీకి కేంద్రం వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఏపీకి ప్రాజెక్టుల వారీగా ఎంత ఇచ్చారంటే..
బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు రూ. 5,936 కోట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
విశాఖ స్టీల్కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు.
నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు
ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ. 162 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు
ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు
ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశకు రూ.242.50 కోట్లు
Updated Date - Feb 01 , 2025 | 04:37 PM