Health Tips: ఇవి ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఖాయం..
ABN, Publish Date - Jan 05 , 2025 | 04:08 PM
బాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, కొన్ని పొరపాట్ల వల్ల ఈ డ్రై ఫ్రూట్స్ కిడ్నీలో రాళ్లను ఏర్పడేలా చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్య ఉన్నవారు బాదంను ఎక్కువగా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. గుండెను బలోపేతం చేయడం నుండి రక్తపోటును తగ్గించడం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వరకు ప్రతిదీ ఇందులో ఉంటుంది. అయితే, బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు వస్తాయి. బాదంపప్పును తీసుకునేటప్పుడే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు ఈ పొరపాట్లను చేయకండి.
బాదంపప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పెద్దలు ప్రతిరోజూ 20-23 బాదంపప్పులను తినడం సురక్షితం అని నిపుణులు భావిస్తున్నారు. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
రాళ్ల ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు:
రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలి. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సమతుల్య ఆహారం, తగిన మొత్తంలో నీరుతో బాదంపప్పును తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ, అధిక పరిమాణంలో తినవద్దు.
(Note: ఈ కథనం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడింది. ABN న్యూస్ దీనిని ధృవీకరించాలి. మీరు ఏదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే వైద్యుడిని సంప్రదించండి.)
Updated Date - Jan 05 , 2025 | 04:08 PM