ఆ కేసులో వైసీపీ నేతలకు బిగిస్తున్న ఉచ్చు..
ABN, Publish Date - Aug 22 , 2024 | 07:52 AM
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో వైసీపీ నేతలకు ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు కీలక నిందితులను విచారిస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలోని సీసీటీవీ పుటేజి తమకు ఇవ్వాలని నోటీసులు పంపించారు.
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో వైసీపీ నేతలకు ఉచ్చు బిగిస్తోంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు కీలక నిందితులను విచారిస్తున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలోని సీసీటీవీ పుటేజి తమకు ఇవ్వాలని నోటీసులు పంపించారు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంటికి నోటీసులు అంటించి విచారణకు అందుబాటులోఉండాలని ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తులో సీసీటీవీ పుటేజి కీలకంగా మారింది. మరోవైపు దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్ల ముందస్తు బెయిల్పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసు వైసీపీ నేతల మెడకు చుట్టుకుంది. 2021 అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం వైసీపీ నేతలు విజయవాడలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటితోపాటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడులు చేశారు. ఈ దాడుల దృశ్యాలు టీడీపీ కార్యాలయంలోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. అప్పట్లో కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు మౌన దీక్ష చేశారు. ఆ తర్వాత రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 22 , 2024 | 07:52 AM