జగన్ బయటకు వస్తే పచ్చని చెట్లు ఫినిష్..
ABN, Publish Date - Apr 05 , 2024 | 10:00 AM
అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లు.. తన పర్యటనల కోసం చెట్లను అడ్డంగా నరికివేయించిన సీఎం జగన్.. ఎన్నికల వేళ కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. జగన్ ఎక్కడకు పర్యటనకు వెళితే అక్కడ చెట్లు నరికివేయడం, విద్యుత్ వైర్లు తొలగించడం పరిపాటిగా మారింది.
అమరావతి: అధికారంలో ఉన్న ఐదేళ్లు.. తన పర్యటనల కోసం చెట్లను అడ్డంగా నరికివేయించిన సీఎం జగన్.. ఎన్నికల వేళ కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. జగన్ ఎక్కడకు పర్యటనకు వెళితే అక్కడ చెట్లు నరికివేయడం, విద్యుత్ వైర్లు తొలగించడం పరిపాటిగా మారింది. సీఎం జగన్ ఈ నెల 2న అన్నమయ్య జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర కొనసాగిన మార్గంలో అధికారులు భద్రతపేరుతో పలుచోట్ల తక్కువ ఎత్తులో ఉన్నాయనే కారణంతో విద్యుత్ వర్లను తొలగించారు. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. మొలకలచెరువులో ఉదయం 7:30 గంటల నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Apr 05 , 2024 | 10:00 AM