అందుకే ఈ నిర్ణయం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Jul 31 , 2024 | 09:06 AM
హైదరాబాద్: రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయెజనం లేకుండా కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలియజేశారు.
హైదరాబాద్: రాజకీయ పార్టీలు సాధారణంగా ప్రజలను ఓట్లు అడిగేటప్పుడు రుణమాఫీ వంటి వాటిపై నిర్ణయాలు తీసుకుంటాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయెజనం లేకుండా కేవలం రైతు ప్రయోజనం కోసం ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని తెలియజేశారు. కానీ తమ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఏ ఎన్నికలు లేకపోయినా రుణ మాఫీ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. రైతుకు ప్రభుత్వం అండగా ఉందన్న విశ్వాసం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. రైతు ప్రయోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. కాగా మంగళవారం శాసనసభ విరామ సమయంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు రూ. లక్షా 50వేల రుణమాఫీ చెక్కులను అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్..
మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..
విపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..ర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 31 , 2024 | 09:06 AM