కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్..
ABN, Publish Date - Aug 20 , 2024 | 01:46 PM
హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాటకు మాట.. టచ్ చేసి చూడు అన్నస్థాయిలో ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: తాము అధికారంలోకి వస్తే సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. మాటకు మాట.. టచ్ చేసి చూడు అన్నస్థాయిలో ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు. కాగా మంగళవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ సచివాలయం ముందు ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలవాలని నిర్ణయించారు. తేదీలు కుదరకపోవడంతో అగ్రనేతలు విగ్రహ ఆవిష్కరణకు రాలేదు. దీంతో రాజీవ్ విగ్రహా ఆవిష్కరణ వాయిదా పడింది. వారం రోజుల్లో పండుగ వాతావరణంలో రాజీవ్ విగ్రాహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాగా సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు సెక్రటేరియట్ ముందు రాజీవ్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి పలువురు కవులు, కళాకారులు లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోమశిల ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్.. (ఫోటోగ్యాలరీ)
మలుపులు తిరుగుతున్న ఏపీ మద్యం కుంభకోణం..
ఏపీలో కరువు మాట వినిపించకూడదు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 20 , 2024 | 01:47 PM