ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భర్తకు గుడి కట్టిన భార్య!

ABN, Publish Date - Apr 25 , 2024 | 04:16 AM

భర్త చనిపోయినా ఆయన జ్ఞాపకాలను మరువలేని ఆ భార్య ప్రేమతో భర్తకు గుడి కట్టించారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

మహబూబాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 24: భర్త చనిపోయినా ఆయన జ్ఞాపకాలను మరువలేని ఆ భార్య ప్రేమతో భర్తకు గుడి కట్టించారు. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ మండలం సోమ్లతండాకు చెందిన బానోత్‌ హరిబాబుకు అమనగల్‌కు చెందిన కల్యాణితో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే 2020 సెప్టెంబరు 9న కొవిడ్‌తో హరిబాబు మృతి చెందారు. అప్పటి నుంచి భర్త జ్ఞాపకాలతో జీవనం సాగిస్తున్న కల్యాణి ఆరునెలల క్రితం సోమ్లతండాలోని తమకున్న భూమిలో భర్తకు గుడి నిర్మించాలని నిర్ణయించుకున్నారు. రూ.7 లక్షల వెచ్చించి రాజస్థాన్‌లో హరిబాబు పాలరాతి విగ్రహాం తయారు చేయించారు. మొత్తం గుడి కోసం రూ.30 లక్షలు ఖర్చు చేశారు. బుధవారం అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణి, ఆమె కుటుంబసభ్యులు హరిబాబు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడిలో భర్తను నిత్యం పూజించడంతో పాటు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తానని కల్యాణి తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 04:16 AM

Advertising
Advertising