ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ABN, Publish Date - May 17 , 2024 | 12:36 AM

చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పరిగి మండలం నస్కల్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

పరిగి, మే 16: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పరిగి మండలం నస్కల్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. నస్కల్‌ గ్రామానికి చెందిన ఎండీ ముస్తఫా(38) బుధవారం సాయంత్రం పొలం దగ్గర పనికని ఇంటి నుంచి బయల్దేరి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో, తెలిసిన వారిని ఆరాతీసినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో గురువారం ఉదయంలో పొలం దగ్గర చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి మృతుడి తండ్రి ఎండీ హుస్సేన్‌కు సమాచారం అందించాడు. తన కొడుకు తరచూ మద్యం సేవిస్తుండేవాడని, కొడుకు మృతిపై తనకు ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని హుస్సేన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పరిగి ఎస్‌ఐ సంతోష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 09:35 AM

Advertising
Advertising