ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి

ABN, Publish Date - Apr 25 , 2024 | 01:00 AM

సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ అధికారులకు సూచించారు.

గోదావరిఖని, ఏప్రిల్‌ 24: సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌ అధికారులకు సూచించారు. బుధవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో రామగుండం-1, 2, 3, ఏఎల్‌పీ ఏరియాలకు చెందిన జీఎంలు, ఏజెంట్లు, ప్రాజెక్టు అధికారులతో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత, రవాణాపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియాల వారీగా నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని, సకాలంలో ఓవర్‌ బర్డెన్‌ను తొలగించి బొగ్గు ఉత్పత్తి, రవాణాను త్వరితగతిన చేపట్టాలని కోరారు. యంత్రాలను 100శాతం సామర్థ్యంతో వినియోగించి బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించా రు. ఆర్‌జీ-1 జీఎం చింతల శ్రీనివాస్‌, ఆర్‌జీ-2 జీఎం ఎల్‌వీ సూర్యనా రాయణ, ఆర్‌జీ-3 జీఎం సుధాకర్‌రావు, పీఓ చంద్రశేఖర్‌, ఏజెంట్లు బానో తు సైదులు, చిలుక శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:00 AM

Advertising
Advertising