మన ఊరు- మనబడి పనుల పరిశీలన
ABN, Publish Date - May 15 , 2024 | 11:07 PM
మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టీడీ గుట్ట పాఠశాలలో జరుగుతున్న మన ఊరు -మన బడి పనులను బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకుడు మల్లయ్య భట్టు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
టీడీ గుట్ట పాఠశాలలో పనులను పరిశీలిస్తున్న మలయ్య భట్టు
మహబూబ్నగర్ విద్యావిభాగం మే 15 : మహబూబ్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, టీడీ గుట్ట పాఠశాలలో జరుగుతున్న మన ఊరు -మన బడి పనులను బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకుడు మల్లయ్య భట్టు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ , మరుగుదొడ్ల పనులను పరిశీలించారు. పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసకున్నారు. ఆయన వెంట డీఈవో రవీందర్ , సీఎంవో బైకాని బాలు యాదవ్ , ఏఎంవో దుంకుడు శ్రీనివాస్ , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 15 , 2024 | 11:07 PM