కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
ABN, Publish Date - Jun 24 , 2024 | 12:28 AM
కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, అప్పుడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
శాలిగౌరారం, జూన 23: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, అప్పుడే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. మండలంలోని వల్లాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంచుకట్ల సైదులు, జలందర్రెడ్డి, కొత్త శంకర్రెడ్డి, గోలి లింగారెడ్డి, కారింగుల సైదులు, దాసరి శ్రీధర్తో పాటు మరో 50 మం ది ఆదివారం ఎమ్మెల్యే సామేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ద గ్గర పడుతున్నందున కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమా లు ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షు డు కందాల సమరంరెడ్డి, మాజీ సర్పంచ షేక్ ఇంతియాజ్ ఆహ్మద్, నాయకులు జంగిలి మారయ్య, పెరుమాండ్ల నరేష్, సైదులు, సైదులు, భిక్షం, ఆం జనేయులు, ఉపేందర్, నాగరాజు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
నల్లగొండ: నల్లగొండ మండలంలోని పెద్దసూరారం గ్రామానికి చెందిన పాల సంఘం డైరెక్టర్లు కోట్ల కరుణాకర్రెడ్డి, కోట్ల లక్ష్మారెడ్డి, ఎర్రమాద నర్సిరెడ్డి ఆదివారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మంత్రి కోమటిరెడ్డి వెంక ట్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారి కి మంత్రి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహనరెడ్డి, మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివా స్రెడ్డి, ఎంపీటీసీ పెండెం రత్నమాల పాండు, మాజీ వైస్ ఎంపీపీ పెండెం అరుణరామకృష్ణ, నాయకులు ఏడుదొడ్ల వెంకట్రామిరెడ్డి, నాయకులు పిల్లి గిరి, ఎంపీటీసీ పెండెం పాండు, రత్నారెడ్డి, కరుణాకర్రెడ్డి, రామలింగం, ఎర్రమాద మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2024 | 12:28 AM