Kumaram Bheem Asifabad: కౌటాల విద్యార్థినికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో రాష్ట్ర రెండో ర్యాంకు
ABN, Publish Date - Apr 25 , 2024 | 09:44 PM
కౌటాల, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన గీతభవాని రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. బోదంపల్లి గ్రామానికి చెందిన మోర్లె శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కూతురు గీతాభవానికి ఇంటర్లో బైపీసీ మొదటి సంవత్సరంలో 437/440 మార్కులు సాధించింది.
కౌటాల, ఏప్రిల్ 25: ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఫలితాల్లో మండలంలోని బోదంపల్లి గ్రామానికి చెందిన గీతభవాని రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. బోదంపల్లి గ్రామానికి చెందిన మోర్లె శ్రీనివాస్-లక్ష్మి దంపతుల కూతురు గీతాభవానికి ఇంటర్లో బైపీసీ మొదటి సంవత్సరంలో 437/440 మార్కులు సాధించింది. గీతాభవానికి 1నుంచి 4వతరగతి వరకు మండలకేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిర్పూర్(టి) సోషల్ వెల్ఫేర్లో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని శ్రీచైతన్య కళాశాలలో చదువుకుంది. ఈసందర్భంగా పలువురు ఆమెతోపాటు తల్లిదండ్రులను అభినందిస్తూ సన్మానించారు.
Updated Date - Apr 25 , 2024 | 09:44 PM