ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చేవెళ్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య

ABN, Publish Date - Apr 18 , 2024 | 04:16 AM

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణహత్యకు గురయ్యారు. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా తన సొంత బావ మరిదే ఆయనను గొడ్డలితో నరికి చంపేశాడు. చేవెళ్లకు చెందిన కడమంచి నారాయణదాస్‌ (49) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

గొడ్డలితో నరికి చంపిన బావమరిది

చేవెళ్ల, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణహత్యకు గురయ్యారు. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా తన సొంత బావ మరిదే ఆయనను గొడ్డలితో నరికి చంపేశాడు. చేవెళ్లకు చెందిన కడమంచి నారాయణదాస్‌ (49) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండేవారు. నారాయణదాస్‌ బావమరిది భాస్కర్‌ కూడా ఆయనతో కలిసి అదే పని చేస్తున్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం ఒక భూమి విషయంలో డబ్బులిస్తానని భాస్కర్‌కు నారాయణదాస్‌ మాటిచ్చాడు. హమీ మేరకు డబ్బులివ్వలేదని 3 నెలలుగా నారాయణదా్‌సకు భాస్కర్‌ దూరంగా ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం నారాయణదాస్‌ తన ఫామ్‌హౌ్‌సకు వెళ్దామని భాస్కర్‌కు ఫోన్‌చేసి రమ్మనడంతో వచ్చాడు. ఇద్దరూ కలిసి కారులో ఊరెళ్లలో ఉన్న ఫామ్‌హౌ్‌సకు వెళ్లారు. అక్కడ ఇద్దరూ మద్యం తాగి డబ్బుల విషయంలో గొడవపడ్డారు. ఆగ్రహించిన భాస్కర్‌ గొడ్డలితో నారాయణదాస్‌ గొంతుపై నరికి హత్య చేశాడు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. నారాయణదాస్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 18 , 2024 | 04:16 AM

Advertising
Advertising