Third Phase polling: మూడో దశ పోలింగ్.. ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు
ABN, Publish Date - May 05 , 2024 | 05:56 PM
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ మే 7వ తేదీ.. అంటే మంగళవారం జరగనుంది. ఈ దశలో దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడో దశలో మొత్తం 1351 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. వారిలో ప్రముఖులు..
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. గుజరాత్లోని గాంధీ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్.. మెయిన్పురి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్లోని గుణ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిశ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
మహరాష్ట్రలోని బారామతి నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా సుప్రియా సులే బరిలో దిగారు.
కె.ఎస్.ఈశ్వరప్ప కర్ణాటకలో బీజేపీ తిరుగుబాటు నేత. షిమోగా నుంచి ఎన్నికల్లో పోటీ నిలిచారు.
Updated Date - May 05 , 2024 | 05:56 PM