ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Millet Dosa : మిల్లెట్ దోసతో రెగ్యులర్ బ్రేక్ ఫ్రాస్ట్‌కి మంచి రుచిని ఇవ్వండి..!

ABN, Publish Date - Jan 31 , 2024 | 01:03 PM

బియ్యం దోసలా కాకుండా, మిల్లెట్ దోస ఆరోగ్యాన్ని అందిస్తుంది. రైస్ దోసను ప్రధానంగా బియ్యంతో తయారు చేస్తారు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది,

millet dosa

బ్రేక్ ఫాస్ట్ అనగానే రొటీన్ దోసలు, ఇడ్లీలు, ఊతప్పాలు వేసుకుని తినడమే కానీ.. ఆరోగ్యాన్ని పెంచే విధంగా అల్పాహారాన్ని ఫ్లాన్ చేయడం కాస్త తక్కువే. రుచికరమైన విధంగా బ్రేక్ ఫాస్ట్‌ని మార్చేయడం వల్ల ఆరోగ్యం కూడా బోనస్‌గా దొరుకుతుంది. మిల్లెట్ దోస, ప్రత్యేకంగా పోషకమైన రాగులు, బచ్చలి కూర దోసెలతో ఆరోగ్యం కూడా పెరుగుతుంది.

మిల్లెట్ దోస ఒక సువాసన, పోషకమైన ఎంపికగా నిలుస్తుంది. రాగి, పోషకాలు అధికంగా ఉండే మిల్లెట్, బచ్చలికూరలో, విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్ల పవర్‌హౌస్‌తో కలిపి, ఈ దోస శరీరానికి పోషణనిస్తుంది. మంచి రుచిని కూడా ఇస్తుంది. ఇందులోని శక్తివంతమైన పోషకాలు, విటమిన్స్ నుంచి ఆరోగ్యాన్ని ఇచ్చేంతవరకూ మిల్లెట్ దోస మంచి టిఫిన్.

మిల్లెట్ దోస ఆరోగ్యకరమా?

మిల్లెట్ దోస, ముఖ్యంగా రాగి (ఫింగర్ మిల్లెట్) బచ్చలికూరతో తయారు చేస్తారు, ఇది పోషకాల పవర్‌హౌస్. రాగుల్లో కాల్షియం, ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి, అలాగే బచ్చలికూరలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రెండూ కలిపి తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: ముక్కుకారడం, దగ్గు లక్షణాలను సాధారణ జలుబు అనుకుంటే పొరపాటే.. దీనికి ప్రధాన కారణం..!


రైస్ దోస, మిల్లెట్ దోస మధ్య తేడా ఏమిటి?

సాంప్రదాయ బియ్యం దోసలా కాకుండా, మిల్లెట్ దోస ఆరోగ్యాన్ని అందిస్తుంది. రైస్ దోసను ప్రధానంగా బియ్యంతో తయారు చేస్తారు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, మిల్లెట్ దోసలో రాగి వంటి పోషకాలుంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్, అధిక పోషక విలువను అందిస్తుంది. కాబట్టి, ఈ రాగి, బచ్చలికూర దోసను ఈసారి బ్రేక్ ఫాస్ట్‌లో తిని చూడండి.

రాగి పాలకూర దోస రెసిపీ

చిటికెడు చక్కెరతో పాలకూరను నీటిలో ఉడకబెట్టాలి. చిన్న ముక్కలుగా తరిగి ఇందులో పచ్చిమిర్చి, అల్లం వేసి కలపాలి. ఒక గిన్నెలో, పాలకూర, రాగుల పొడి, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర పొడి, వేసి నీటితో కలపాలి. కొద్దిగా కొత్తిమీర వేసి.. తవా మీద పోయాలి. కాస్త రుచి, సువాసన కోసం నెయ్యి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

Updated Date - Jan 31 , 2024 | 01:03 PM

Advertising
Advertising