రైల్వే బోర్డు చైర్మన్గా సతీష్ కుమార్
ABN, Publish Date - Aug 28 , 2024 | 06:46 AM
రైల్వే బోర్డు చైర్మన్-సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు(ఐఆర్ఎంఎస్) అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి ఎస్సీ అధికారి ఆయనే కావడం విశేషం.
ఆ పదవి చేపట్టనున్న తొలి దళిత అధికారి
న్యూఢిల్లీ, ఆగస్టు 27: రైల్వే బోర్డు చైర్మన్-సీఈఓగా ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు(ఐఆర్ఎంఎస్) అధికారి సతీష్ కుమార్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న తొలి ఎస్సీ అధికారి ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం చైర్మన్గా ఉన్న జయ వర్మ సిన్హా ఈ నెల 31న పదవీ విరమణ చేసిన అనంతరం సతీష్ కుమార్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. సతీశ్ ప్రస్తుతం ఆయన రైల్వే బోర్డు మెంబర్(ట్రాక్షన్-రోలింగ్ స్టాక్)గా ఉన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 06:47 AM