ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections Result: సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్..!

ABN, Publish Date - Jun 06 , 2024 | 06:34 PM

తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలం పుంజుకుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. దీంతో లోక్‌సభలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా లభించినట్లు అయింది.

న్యూఢిల్లీ, జూన్ 06: తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి బలం పుంజుకుంది. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి సైతం గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. దీంతో లోక్‌సభలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా లభించినట్లు అయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ పదవి చేపట్టాలంటూ ఆ పార్టీలోని నేతలు ఎక్స్ వేదికగా అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో వారి అభిప్రాయాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీకే ఆ స్లాట్ వస్తుందని భావిస్తున్నానన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందిస్తూ.. లోక్‌సభలో రాహుల్ గాంధీ తమ నాయకుడిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ ఎన్నికల్లో ప్రజల మధ్యకు వెళ్లి రాహుల్ గాంధీ పేరు చెప్పి ఓట్లు అడిగానన్నారు. తమ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులంతా ఇదే విధంగా కోరుకుంటారన్నారు. అయితే తమది ప్రజాస్వామిక పార్టీ అని ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు.


ఇక కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వివేక్ తంఖా సైతం స్పందించారు. ఈ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ముందుండి నడించారన్నారు. ఆ క్రమంలో ఆయన సభలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. పార్టీ ఎంపీలు ఆ దిశగా ఆడుగులు వేసి.. ఆయన్ని నాయకులుగా ఎన్నుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉంటే తాము సైతం స్వాగతిస్తామని మహారాష్ట్ర ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇక అమేఠీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచి గెలిచిన కేఎల్ శర్మ సైతం లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. అలాగే ప్రియాంక గాంధీ సైతం ఎన్నికల్లో పోటీ చేసి.. పార్లమెంట్లోకి రావాలని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 06 , 2024 | 06:40 PM

Advertising
Advertising