వొడాఫోన్ ఐడియా నష్టం రూ.7,675 కోట్లు
ABN, Publish Date - May 17 , 2024 | 04:18 AM
ఈ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా నష్టం రూ.7,675 కోట్లకు పెరిగింది. వడ్డీ చెల్లింపులు, రుణ వ్యయాల భారం అధికమవడం..
న్యూఢిల్లీ: ఈ మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా నష్టం రూ.7,675 కోట్లకు పెరిగింది. వడ్డీ చెల్లింపులు, రుణ వ్యయాల భారం అధికమవడం ఇందుకు కారణమైంది. గత ఏడాదిలో ఇదే కాలానికి కంపెనీ నష్టం రూ.6,419 కోట్లుగా నమోదైంది. ఈ జనవరి-మార్చి కాలానికి సంస్థ ఏకీకృత ఆదాయం రూ.10,607 కోట్లకు పరిమితమైంది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తానికి వొడాఫోన్ ఐడియా రూ.42,651.7 కోట్ల ఆదాయంపై రూ.31,238.4 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ మార్చి క్వార్టర్లో కంపెనీకి ఒక్కో వినియోగదారు నుంచి లభించే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) వార్షిక ప్రాతిపదికన 7.6 శాతం పెరిగి రూ.146కు చేరుకుంది.
Updated Date - May 17 , 2024 | 04:18 AM