ఐ-టీడీపీ కార్యకర్తపై వైసీపీ వర్గీయుల దాడి
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:10 AM
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఐ-టీడీపీ నాయకుడిపై వైసీపీ వర్గీయులు గురువారం దాడికి పాల్పడారు.
రాయదుర్గం, ఏప్రిల్ 25: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఐ-టీడీపీ నాయకుడిపై వైసీపీ వర్గీయులు గురువారం దాడికి పాల్పడారు. మల్లాపురం తండాకు చెందిన కృష్ణానాయక్ వృత్తి రీత్యా టైలర్. ఐ-టీడీపీ రాయదుర్గం మండల అధ్యక్షుడిగా ఉన్నారు. టైలరింగ్ పనుల కోసం గురువారం రాయదుర్గం పట్టణానికి బైక్పై బయలుదేరాడు. పట్టణంలో వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీ జరుగుతుండగా, ఎటూ పోలేక మధ్య నుంచి వాహనాన్ని నడిపాడు. కృష్ణానాయక్ చొక్కా జేబులో ఉన్న ఫోన్పై ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ’ లోగో వైసీపీ వారికి కనిపించింది. టీడీపీ కార్యకర్తగా నిర్ధారించుకుని మూకుమ్మడి దాడికి పాల్పడటంతో కృష్ణా నాయక్కు భుజం, కాళ్లూచేతులకు గాయాలయ్యాయి. బాధితుడు వారి నుంచి తప్పించుకుని పరుగులు పెడుతూ టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నాడు. టీడీపీ నాయకులు అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు.
Updated Date - Apr 26 , 2024 | 07:39 AM