రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్రెడ్డిని ఓడించాలి
ABN, Publish Date - Apr 25 , 2024 | 11:38 PM
రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్రెడ్డిని సమష్టిగా ఓడించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని, ఉంగుటూరు అభ్యర్థి పత్సమట్ల
భీమడోలు, ఏప్రిల్ 25 :రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్రెడ్డిని సమష్టిగా ఓడించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు అన్నారు. పూళ్ళ గ్రామంలో గురువారం ‘జనంలోకి ధర్మరాజు’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పత్సమట్ల ధర్మరాజుతో పాటు గన్ని వీరాంజనే యులు, వట్టి పవన్ తదితరులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. కూటమి పథకాలను ప్రజలకు వివరించారు. ధర్మరాజు, గన్ని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడాలంటే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రపఽథంలో నిలపాలంటే కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి రావాలన్నారు. ఉమ్మడి అభ్యర్థి ధర్మరాజు గుర్తు గాజు గ్లాసుకు, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్యాదవ్ గుర్తు సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణ, జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2024 | 11:38 PM