విశాఖ-అరకు రోడ్డు వెడల్పు తగ్గించాలి
ABN, Publish Date - Jul 15 , 2024 | 11:33 PM
శాఖ నుంచి పెందుర్తి, కొత్తవలస, ఎల్.కోట, వేపాడ, ఎస్కోట మం డలాల నుంచి అరకు వరకు విస్తరించనున్న రోడ్డు వెడల్పు తగ్గించాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘ నాయకులు డేగల అప్పలరాజు డిమాండ్ చేశారు.
కలెక్టరేట్: విశాఖ నుంచి పెందుర్తి, కొత్తవలస, ఎల్.కోట, వేపాడ, ఎస్కోట మం డలాల నుంచి అరకు వరకు విస్తరించనున్న రోడ్డు వెడల్పు తగ్గించాలని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘ నాయకులు డేగల అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఈరోడ్డుకు ఆనుకునిఉన్న రైతులు,ప్రజలు అభిప్రాయాలు తీసుకోకుండా విస్త రిస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్నవారికి, చేసుకొని వారికి ప్రభుత్వ కన్వర్షన్ ప్రకారం పరిహారం అందజేయాలని కోరారు.
డిపాజిట్లు వెంటనే చెల్లించాలి
సహారా ఖాతాదారులకు ,ఏజెంట్లుకు న్యాయం చేసి, డిపాజిట్లు చెల్లించాలని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఖాతాదారుల డిపాజిట్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్చేశారు.పలువురు ఖాతాదారులు నిరసనచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకో వడంలేదని వాపోయారు.కార్యక్రమంలోని ఏజెంట్లు, డిపాజిట్దారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 11:33 PM