ఎన్టీఆర్తో రాజయ్య
ABN, Publish Date - Apr 20 , 2024 | 12:17 AM
టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 1983 ఎన్నికల్లో అప్పటి సాలూరులోని అభ్యర్థి బోయిన రాజయ్యను తన చైతన్యరథంపై ఎక్కించి ప్రచారం చేశారు.
సాలూరు రూరల్ : టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 1983 ఎన్నికల్లో అప్పటి సాలూరులోని అభ్యర్థి బోయిన రాజయ్యను తన చైతన్యరథంపై ఎక్కించి ప్రచారం చేశారు. అప్పట్లో ప్రచారం చేస్తున్న ఫొటో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అప్పట్లో రాజకీయాలకు పరిచయం లేని ఉపాధ్యాయుడు బోయిన రాజయ్యకు ఎన్టీఆర్ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఈ ఫొటోను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.
Updated Date - Apr 20 , 2024 | 12:17 AM