నిబంధనల మేరకు ఎన్నికలు
ABN, Publish Date - Apr 16 , 2024 | 12:26 AM
రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిబంధనల మేరకు నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి ఎంవీ సూర్యకళ అన్నారు.
గజపతినగరం: రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిబంధనల మేరకు నిర్వహిస్తామని రిటర్నింగ్ అధికారి ఎంవీ సూర్యకళ అన్నారు. సోమవా రం స్థానిక ప్రభుత్వ బాలికల హైస్కూలులో ఏపీవోల శిక్షణ తరగతులను ఆమె పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నికల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, 26న స్ర్కూట్నీ ఉం టుందన్నారు. నామినేషన్ల దాఖలుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్ర మంలో ఈఆర్ఓ ప్రమీలాగాంధీ, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 16 , 2024 | 12:26 AM