చెక్పోస్టు వద్ద నగదు పట్టివేత
ABN, Publish Date - Apr 18 , 2024 | 12:25 AM
పాలకొండ-రాజాం రోడ్డులో గొట్టమంగళాపురం చెక్పోస్టు వద్ద బుధవారం రాత్రి ప్రత్యేక పోలీసు బలగాలు నగదును స్వాధీనం చేసుకున్నారు.
పాలకొండ: పాలకొండ-రాజాం రోడ్డులో గొట్టమంగళాపురం చెక్పోస్టు వద్ద బుధవారం రాత్రి ప్రత్యేక పోలీసు బలగాలు నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల నేపథ్యంలో విజయనగరం నుంచి పాలకొండ వస్తున్న స్వస్తిక్ ఎంటర్ ప్రైజెస్ చెందిన వాహనాన్ని కూడా వారు పరిశీలించారు. ఆ సంస్థ ఏజెంట్ వద్ద రూ.2 లక్షల 52వేలు ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి రశీదులను సమర్పించకపోవడంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని నోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అధికారులు ఎస్.మహేశ్వరరావు, గణపతులకు అందించారు. ఈ మొత్తాన్ని పాలకొండ ట్రెజరీలో భద్రపరిచినట్లు ఎన్సీసీ అధికారులు తెలిపారు.
Updated Date - Apr 18 , 2024 | 12:25 AM