ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:12 AM

‘నన్ను ఆశీర్వదించి గెలిపించండి.. కురుపాం నియోజక వర్గా న్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తా’ అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు.

జియ్యమ్మవలస: ‘నన్ను ఆశీర్వదించి గెలిపించండి.. కురుపాం నియోజక వర్గా న్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తా’ అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తోయక జగదీశ్వరి కోరారు. జియ్యమ్మవలసలో టీడీపీ మండల కన్వీనర్‌ పల్ల రాంబాబు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. పదేళ్లు ఎమ్మెల్యేగా, రెండేళ్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన పుష్పశ్రీవాణి గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు.. నియోజకవర్గం అభివృద్ధిని విస్మరించారన్నారు. ‘నేనే మీ ఇంటి ఆడపడుచుగా వచ్చా ను.. నన్ను ఆశీర్వదించి ఓటేయండి.. మీ అందరి చల్లని దీవెనలే నాకు శ్రీరామరక్ష’ అన్నారు. ఈనెల 22వ తేదీన నామినేషన్‌ వేస్తున్నానని అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు రావాలని ఆమె పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌, దత్తి లక్ష్మణరావు, ఎంపీపీ బొంగు సురేష్‌, డొంకాడ రామ కృష్ణ, కోలా రంజిత్‌కుమార్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకుడు మల్లేసు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:12 AM

Advertising
Advertising