ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బైండోవర్లు కీలకం

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:11 AM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా... అల్లరిమూకలు, పాత నేరస్థులు తదితరులపై పోలీసులు దృష్టి పెట్టారు.

- 14,344 బైండోవర్‌ కేసులు

- 111 మంది రౌడీ షీటర్లు

విజయనగరం క్రైం: జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా... అల్లరిమూకలు, పాత నేరస్థులు తదితరులపై పోలీసులు దృష్టి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది మొదలు సంబంధిత స్టేషన్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో బైండోవర్‌ కేసుల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 14,344 మందిని బైండోవర్‌ చేశారు. విజయనగరం జిల్లాలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 33 స్టేషన్‌ల పరిధిలో 14,344 మందిపై బైండోవర్‌ కేసులు నమో దయ్యాయి. పాత నేరస్థులకు సంబంధించి 111 మంది పై రౌడీషీట్లు తెరిచారు. వీరందరికీ ఇప్పటికే పోలీసు స్టేషన్లకు రప్పించి...కౌన్సిలింగ్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరిం చాలని... ఇబ్బంది కలిగిస్తే అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో 14,344 బైండోవర్‌ కేసులకు సంబంధించి అధికార వైసీపీపై 7,980, టీడీపీ 7,511, జనసేన 526, ఇతరులు 296 మందిపై నమోదు చేశారు. వీరితో పాటు, రౌడీ షీటర్లకు సంబంధించి 111 మందిని గుర్తించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ క్షేత్రస్థాయిలో ఉన్న సచివాలయ పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు వీరిపై నిఘా ఉంచుతారు. అల్లర్లకు పాల్పడితే వెంటనే వీరిని అదుపులోకి తీసుకుంటారు.

Updated Date - Apr 19 , 2024 | 12:11 AM

Advertising
Advertising