పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రమేశ్ దంపతులు
ABN, Publish Date - Apr 17 , 2024 | 11:43 PM
ఉపమాక మెరకవీధి రామాలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు.
నక్కపల్లి, ఏప్రిల్ 17: ఉపమాక మెరకవీధి రామాలయం వద్ద బుధవారం ఉదయం జరిగిన సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. సీఎం రమేశ్ దంపతులకు ఎన్డీఏ నాయకులు గెడ్డం బుజ్జి, కొప్పిశెట్టి కొండబాబు, కొప్పిశెట్టి వెంకటేశ్, కొప్పిశెట్టి బుజ్జి, తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు.
Updated Date - Apr 17 , 2024 | 11:43 PM