ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌ ప్రచార వాహనంపై వైసీపీ శ్రేణుల దాడి

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:14 AM

టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌ నామినేషన్‌ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వైసీపీ కార్యకర్తలు స్థానిక రవీంద్రభారతి పాఠశాల సమీపంలో అటుగా వస్తున్న డాక్టర్‌ కిల్లి కృపారాణికి చెందిన కాంగ్రెస్‌ ప్రచార వాహనంపై దాడికి పాల్పడ్డారు.

ప్రచార వాహనంపై కృపారాణి ఫ్లెక్సీలను చింపేసిన వైసీపీ శ్రేణులు

టెక్కలి, ఏప్రిల్‌ 19: టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌ నామినేషన్‌ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన వైసీపీ కార్యకర్తలు స్థానిక రవీంద్రభారతి పాఠశాల సమీపంలో అటుగా వస్తున్న డాక్టర్‌ కిల్లి కృపారాణికి చెందిన కాంగ్రెస్‌ ప్రచార వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఆటోపై ఉన్న కృపారాణి ఫ్లెక్సీలను చించివేశారు. దీంతో ఆటో డ్రైవర్‌ ఆటోను నిలిపి పరుగులు తీశారు. కృపారాణి ఇటీవల వైసీపీని వీడి.. టెక్కలి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తుండడంతో పలువురు వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కృపారాణి అనుచరులు శుక్రవారం రాత్రి టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఓటమికి భయపడి వైసీపీ శ్రేణులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు ఆరోపించారు.

Updated Date - Apr 20 , 2024 | 12:14 AM

Advertising
Advertising