శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా బదిలీ
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:00 AM
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీమ్ అన్సారియా ప్రకాశం కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు శనివా రం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- ప్రకాశం కలెక్టర్గా నియామకం
శ్రీకాకుళం అర్బన్, జూన్ 22: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీమ్ అన్సారియా ప్రకాశం కలెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు శనివా రం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ల స్థాన చలనంలో భాగంగా.. కమిషనర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేశారు. ఈమె ప్రస్తుత కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ భార్య. ఈ ఏడాది ఫిబ్రవరి 1న శ్రీకాకుళం కార్పొ రేషన్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. సీనియార్టీ ఆధారంగా ఆమెను ప్రకాశం జిల్లా కలెక్టర్గా నియమించా రు. ఆమె స్థానంలో ఇక్కడ ఇంకా ఎవరినీ నియమించలేదు.
Updated Date - Jun 23 , 2024 | 12:00 AM