ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్
ABN, Publish Date - Aug 19 , 2024 | 11:35 PM
ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం బంద్ నిర్వహిస్తున్నట్టు దళిత మహాసభ సభ్యులు తెలిపారు.
కొత్తూరు: ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం బంద్ నిర్వహిస్తున్నట్టు దళిత మహాసభ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సహకరించాలని సీఐ ప్రసాదరావుకు సోమవారం వినతిపత్రం అందిం చారు. ఎస్సీ వర్గీకరణను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో కొత్తూరు మండల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు టొంపల తిరుపతి, కార్యదర్శి పడాల నాగభూషణం, కోశాధి కారి రామ కృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణ, వడమ శ్రీను, బాలకృష్ణ తదితరులున్నారు.
బంద్ను విజయవంతం చేయండి
టెక్కలి: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా టెక్కలి నియోజక వర్గ జేఏసీ పిలుపు మేరకు బుధ వారం భారత్ బంద్ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, రవాణా, వాణిజ్య, వర్తక, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు బంద్కు సహకరించాలని కోరారు.
Updated Date - Aug 19 , 2024 | 11:35 PM