మెగా డీఎస్సీ ప్రకటించడం శుభపరిణామం
ABN, Publish Date - Jun 14 , 2024 | 11:50 PM
ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని సీఎంగా చంద్ర బాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమలు చేసే సంతకం చేయ డం శుభపరిణామమని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు, నిరుద్యోగులు అన్నారు.
సీఎం చిత్రపటానికి నిరుద్యోగుల పాలభిషేకం
హిరమండలం: ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన మెగా డీఎస్సీ హామీని సీఎంగా చంద్ర బాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమలు చేసే సంతకం చేయ డం శుభపరిణామమని జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు, నిరుద్యోగులు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం టీడీపీ నాయ కులు, నిరుద్యోగ ఉపాధ్యాయలు సీఎం చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీపై తొలి సంతకంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, సామా జిక పింఛన్ మొత్తం పెంపు, నైపుణ్య గణన ఫైళ్లపై సంతకాలు చేసి అన్ని వర్గాల కు న్యాయం చేశారన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు పెట్టేందుకు ఇవి ఉదా హరణలన్నారు. కార్యక్రమంలో బర్రి సురేష్, కొర్రాయి రాము, ఎస్.జానికిరావు, దేవుదల వెంకటరావు, ఎస్.జగదీష్, టి.శ్రీనివాస రావు, రావాడ లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 14 , 2024 | 11:50 PM