రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి
ABN, Publish Date - Aug 21 , 2024 | 12:26 AM
కారు ఢీకొని పాస్టర్ మృతిచెందిన సంఘటన మంగళవారం ఎండ్లూరు డొంక వద్ద జరిగింది. ఎస్సై దేవకుమార్ తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని ఎం డ్లూరుకు చెందిన అట్లూరి వెంకటేశ్వర్లు(41) పాస్టర్గా పని చేస్తున్నారు.
మరొకరికి గాయాలు
సంతనూతలపాడు, ఆగస్టు 20: కారు ఢీకొని పాస్టర్ మృతిచెందిన సంఘటన మంగళవారం ఎండ్లూరు డొంక వద్ద జరిగింది. ఎస్సై దేవకుమార్ తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని ఎం డ్లూరుకు చెందిన అట్లూరి వెంకటేశ్వర్లు(41) పాస్టర్గా పని చేస్తున్నారు. చీమలమర్రిలో తన స్నేహితుని కుమార్తె ఎండ్లూరు మహిళా ప్రాంగ ణంలో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటోంది. ఈక్ర మంలో తన స్నేహితుడు ఫోన్ చేసి తాను ఈరో జు రాలేనని, తన కూతురుని క్లాసు ముగియగానే తీసుకుని చీమలమర్రిలో వదలిపెట్టాలని వెంకటే శ్వర్లుకు తెలిపారు. ఈక్రమంలో ఆమెను తీసుకుని స్కూటీపై చీమలమర్రికి బయలుదేరేందుకు కర్నూల్రోడ్డుపైకి రాగా అదే సమయంలో ఎండ్లూ రు వైపు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లుకు తీవ్రగాయాలు కావడంతో ఒంగోలు తరలిస్తుండగా మార్గంమ ధ్యలో మృతిచెందాడు. తన స్నేహితుని కుమార్తెకు గాయాలు కావడంతో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆ సుపత్రిలో చేర్పించారు. పోస్టుమార్టం నిమిత్తం పాస్టర్ మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. రిమ్స్ అవుట్పోస్టు నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవ కుమార్ తెలిపారు.
Updated Date - Aug 21 , 2024 | 12:26 AM