వరద బాధితుల కోసం విరాళాల సేకరణ
ABN, Publish Date - Sep 10 , 2024 | 11:10 PM
దర్శి నియోజకవర్గంలో దాతలు తమ ఉదారత ను చాటుకుంటున్నారు. వరద బాధితుల సహాయార్థం లక్షలాది రూపా యలు విరాళాలు ఇస్తున్నారు. మంగళవారం టీడీపీ దర్శి పట్టణ మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్సాగర్ దంపతులకు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు.
దర్శి, సెప్టెంబరు 10: దర్శి నియోజకవర్గంలో దాతలు తమ ఉదారత ను చాటుకుంటున్నారు. వరద బాధితుల సహాయార్థం లక్షలాది రూపా యలు విరాళాలు ఇస్తున్నారు. మంగళవారం టీడీపీ దర్శి పట్టణ మాజీ అధ్యక్షుడు దారం సుబ్బారావు ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్సాగర్ దంపతులకు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు.
అలాగే, బండి వెలిగండ్ల టీడీపీ నాయకుడు యాదాల గు ర్నాథం, యాదాల వెంకటేశ్వర్లు, కురంగి శ్రీనివాసరావు, మల్లె నర్సింహా రావు తదితరులు రూ.10వేలు విరాళం అందజేశారు. సందువారిపాలెం యూత్ ఆధ్వర్యంలో రూ.42,216 విరాళం అందజేశారు. కార్యక్రమంలో ద ర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కర్నా శ్రీనివాసరావు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లచె రువు చిన్నా తదితరులు పాల్గొన్నారు.
దొనకొండ: విజయవాడ వరద బాధితుల సహాయార్థం టీడీపీ మండ ల నాయకుడు వీరపనేని వెంకన్నచౌదరి నేతృత్వంలో సేకరించిన రూ.3 లక్షల పది వేల నగదును ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపా టి లక్ష్మి, డాక్టర్ లలిత్సాగర్లకు మంగళవారం అందజేశారు. కార్యక్రమం లో ఏఎంసీ మాజీ చైర్మన్ రాచగొర్ల వెంకటయ్య, జడ్పీ మాజీ కోఆప్షన్ స భ్యుడు మగ్భూల్ అహ్మద్, రిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ శర్మ, కామేపల్లి చెంచయ్య, దుగ్గెంపూడి కోటేశ్వరరావు, తాండ్ర వెంకటేశ్వర్లు, వేగినాటి అ ల్లూరయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఏబీఎం సాయం.. దొనకొండ, సెప్టెంబరు 10: విజయవాడలో జరిగిన వరద బాధితులను తమవంతుగా ఆదుకోవాలనే ధ్యేయంతో దొనకొండ ఏ బీఎం చర్చి సంఘ స్తులు స్పందించారు.
జిల్లా కలెక్టర్ అన్సారియాను సంఘకాపరి పాస్టర్ డి.ప్రభుదాస్, ప్రెసి డెంట్ కె.చంద్రశేఖర్, కార్యదర్శి కె.విల్సన్, కోశాధికారి ఎన్.సుధీర్, ఎండీ సుధాకర్, మల్లెల ఆనంద్ కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.60 వే లు ఆర్థిక సహాయం అందజేశారు. ఏబీఎం చర్చి సంఘస్తుల దాతృత్వాన్ని కలెక్టర్ అభినందించారు.
వరద బాధితులకు అండగా తాళ్లూరు టీడీపీ శ్రేణులు
తాళ్లూరు, సెప్టెంబరు 10: విజయవాడ వరద బాధితులకు టీడీపీ తాళ్లూరు మండల శ్రేణులు సేకరించిన రూ.4 లక్షల 24వేల విరాళాన్ని ఆపార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్సాగర్లకు మంగళవారం అందజేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి సేకరించిన విరాళాన్ని సీఎం సహాయనిధికి పంపేందుకు దర్శిలో డాక్టర్ లక్ష్మికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శులు మానం రమేష్బాబు, శాగం కొండారెడ్డి, నాయకులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, షేక్ కాలేషావలి, ఐ.శ్రీనివాసరెడ్డి, రాచకొండ వెంకట్రావు, వీరనాగిరెడ్డి, కె.రామయ్య, యాతం శ్రీను, పి.రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కురిచేడు: విజయవాడ వరద బాధితులకు టీడీపీ కురిచేడు మండలం నాయకులు రూ.5 లక్షల విరాళాన్ని మంగళవారం దర్శిలో డాక్టర్ లక్ష్మికి అందజేశారు. కార్యక్రమంలో నెమిలయ్య, కాట్రాజు నాగరాజు, గణపర్తి వెంకటేశ్వర్లు, రావిపాటి శివరామకృష్ణ, ఆదినారాయణ, పెద్దిరెడ్డి, షేక్ సు నీల్, అంకయ్య, చిన్న కొండయ్య, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 11:10 PM