టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనబాక
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:22 AM
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీలో పలువురికి వివిధ పదవీ బాధ్యతలు అప్పగిస్తూ, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సలగల రాజశేఖర్బాబు, టీడీపీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులుగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం(తిరుపతి), ఉన్నం మారుతిచౌదరి(కల్యాణదుర్గం), రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా పుట్టం బ్రహ్మానందరెడ్డి(ఆత్మకూరు), కేఎం జకీఫుల్లా(అనంతపురం అర్బన్), ఇందుకూరి సుబ్బలక్ష్మి( శృంగవరపుకోట), కనపర్తి శ్రీనివాసరావు(గుంటూరు), మాన్వి దేవేంద్రప్ప, గుడిసె ఆది కృష్ణమ్మ(ఆదోని), జంపాల సీతారామయ్య, కేవీవీ సత్యనారాయణరావు(మైలవరం), రాష్ట్ర కార్యదర్శులుగా కే జయరామ్ నాయుడు(అనంతపురం), బూరగడ్డ కిషన్తేజ(పెడన), కోటగుల్లి సుబ్బారావు, కిల్లో వెంకట రమేశ్ నాయుడు(పాడేరు), కల్లపరి బుడ్డారెడ్డి(ఆధోని), కే తిమ్మయ్యచౌదరి(పత్తికొండ), చప్పిడి మహేశ్నాయుడు(రాజంపేట), దొడ్డా వెంకట సుబ్బారెడ్డి(కనిగిరి), డాక్టర్ అయితాబత్తుల సత్యశ్రీ(అమలాపురం), గేదెల శ్రీనుబాబు(విజయనగరం), మోజూరు తేజోవతి(బొబ్బిలి) నియమితులయ్యారు.
Updated Date - Apr 26 , 2024 | 07:18 AM