వైసీపీకి అనుకూలంగా నెల్లూరు రూరల్ డీఎస్సీ
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:27 AM
వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివా్సరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. ఈ మేరకు గురువారం సీఈవోకు ఆయన లేఖ రాశారు. ‘
బదిలీ చేయాలని సీఈవోకు టీడీపీ నేత వర్ల ఫిర్యాదు
అమరావతి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివా్సరెడ్డిని వెంటనే బదిలీ చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. ఈ మేరకు గురువారం సీఈవోకు ఆయన లేఖ రాశారు. ‘ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీగా పని చేస్తున్న నీలకంఠరెడ్డికి డీఎస్పీ శ్రీనివా్సరెడ్డి దగ్గర బంధువు. ఓఎస్డీ ప్రభావంతో డీఎస్పీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. శ్రీనివా్సరెడ్డిని తక్షణం బదిలీ చేసి, ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి’ అని వర్ల రామయ్య సీఈవోను కోరారు.
Updated Date - Apr 26 , 2024 | 04:27 AM