వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
ABN, Publish Date - Apr 18 , 2024 | 12:21 AM
మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామానికి చెందిన బొల్లెద్దుల ఏసేపు (41) అనే ఉపాధి కూలీ బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు.
పగిడ్యాల, ఏప్రిల్ 17: మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామానికి చెందిన బొల్లెద్దుల ఏసేపు (41) అనే ఉపాధి కూలీ బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. ఏసేపు గ్రామ సమీపంలోని కెసీ కాలువ వద్ద జరుగు తున్న ఉపాధి పనులకు ఉదయం వెళ్లాడు. ఎండ తీవ్రత వల్ల పని ప్రదేశంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తోటి కూలీలు ఆటోలో నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య సుజాత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Updated Date - Apr 18 , 2024 | 12:21 AM