‘జగన్ ముఠాను తరిమికొట్టాలి’
ABN, Publish Date - Apr 20 , 2024 | 12:38 AM
ప్రజల జేబులను లూటీ చేసిన సీఎం జగన్ ముఠాను తరిమికొట్టాలని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు.
డోన్, ఏప్రిల్ 19: ప్రజల జేబులను లూటీ చేసిన సీఎం జగన్ ముఠాను తరిమికొట్టాలని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని వైసీపీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ దస్తగిరి, షరీఫ్, అన్వర్, ఇమామ్ బాషా, మహబూబ్ బాషా, అహ్మద్, బాబా ఫకృద్దీన్తో పాటు మరో 50 కుటుంబాలు కోట్ల సమక్షంలో టీడీపీలో చేరాయి. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ లక్ష్మీరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, మాజీ సర్పంచ్ టీఈ కేశవయ్య గౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, లక్ష్మీనారాయణ యాదవ్, ఎస్ఎండీ రఫీ, అన్వర్బాషా పాల్గొన్నారు.
Updated Date - Apr 20 , 2024 | 12:39 AM