ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం

ABN, Publish Date - Jun 01 , 2024 | 12:34 AM

పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్‌ జూన్‌ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమ వుతుందని పాణ్యం రిటర్నింగ్‌ అధికారి, కర్నూలు జిల్లా జేసీ నారపురెడ్డి మౌర్య వెల్లడించారు.

పాణ్యం ఆర్వో నారపురెడ్డి మౌర్య

కర్నూలు(కలెక్టరేట్‌), మే 31: పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్‌ జూన్‌ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమ వుతుందని పాణ్యం రిటర్నింగ్‌ అధికారి, కర్నూలు జిల్లా జేసీ నారపురెడ్డి మౌర్య వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ అనంతరం 8:30 గంటల నుంచి ఈవీఎంల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో పాణ్యం నియోజకవర్గం కౌంటింగ్‌ ఏర్పాట్లపై మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు-2024లో భాగంగా పాణ్యం నియోజకవర్గానికి సంబందించిన కౌంటింగ్‌ రాయలసీమ యూనివర్సిటీలోని మొదటి అంతస్తు ఇంజనీరింగ్‌ బ్లాకులో జరుగుతుం దన్నార. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 5,700 పోస్టల్‌ బ్యాలెట్‌లను 6 టేబుళ్ల ద్వారా రెండు రౌండ్లలో లెక్కించడం జరుగుతుందన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్‌ 26 రౌండ్లలో పూర్తి అవుతుందన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు ఇతర ఎన్నికల సిబ్బంది గుర్తింపు కార్డులతోనే కేంద్రంలోకి రావాలని ఆమె సూచించారు.

Updated Date - Jun 01 , 2024 | 12:34 AM

Advertising
Advertising