బడ్డీ కొట్టు తొలగింపులో ఉద్రిక్తత
ABN, Publish Date - Jun 08 , 2024 | 12:52 AM
పట్టణంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోరూ.కోట్లు విలువ చేసే పాత మునిసిపల్ కార్యాలయం గోడను కూల్చి ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించేందుకు శుక్రవారం మునిసిపల్ అధికారులు ప్రయత్నించ టంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జగ్గయ్యపేట, జూన్ 7: పట్టణంలో వైసీపీ ప్రభుత్వ హయాంలోరూ.కోట్లు విలువ చేసే పాత మునిసిపల్ కార్యాలయం గోడను కూల్చి ఏర్పాటు చేసిన దుకాణాన్ని తొలగించేందుకు శుక్రవారం మునిసిపల్ అధికారులు ప్రయత్నించ టంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏడాది క్రితంపాలకపక్షంలో కొందరు, ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపినా నాటి ఎమ్మెల్యే ఉదయభాను తన అనుచరుడితో బడ్డీ ఏర్పాటు వేయించారు. ప్రభుత్వం మారటంతో మునిసిపల్ అధికారులు శుక్రవారం పోలీసు బందోబస్తుతో బడ్డీ తొలగించేందుకు ప్రయత్నించారు. చైర్మన్ రాఘవేంద్రతో పాటు వైసీపీ కౌన్సిలర్లు దానిని అడ్డుకు న్నారు. ఆక్రమణదారుడికి మద్దతుగా నిలిచారు. మంగళవారం నాటికి స్వచ్ఛం దంగా తొలగించుకునేందుకు ఆక్రమణదారుడు గడువు కోరటంతో అధికారులు వెనక్కి తగ్గారు.
Updated Date - Jun 08 , 2024 | 12:52 AM