కాలానుగుణంగా బోధనా పద్ధతులు మార్చుకోవాలి
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:07 AM
అధ్యాపకులు కాలానుగుణంగా తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలని వ్యక్తిత్వ వికాస నిఫుణుడు రోహిత్ అన్నారు.
కాలానుగుణంగా బోధనా పద్ధతులు మార్చుకోవాలి
వ్యక్తిత్వ వికాస నిఫుణుడు రోహిత్
వన్టౌన్ జూలై 30: అధ్యాపకులు కాలానుగుణంగా తమ బోధనా పద్ధతులను మార్చుకోవాలని వ్యక్తిత్వ వికాస నిఫుణుడు రోహిత్ అన్నారు. ఐటీసీ సంస్థ భాగస్వామ్యంతో కేబీఎన్ కళాశాల ఐక్యూఏసీ, కంప్యూటర్ల విభాగాలు సంయుక్తంగా తరగతి గదిలో బోధనా నైపుణ్యాల అంశంపై కాలేజీలో నిర్వహించిన మూడు రోజుల అధ్యాపకుల శిక్షణ కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యారంగంలో అనేక సాంకేతిక పరమైన మార్పులు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో బోధన విధానంలోను ఇంకా మార్పులు రావాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అధ్యాపకులకు సమకాలీన అంశాలపై పట్టు ఉన్నపుడే విద్యార్థులకు సరిగ్గా బోధించగలుగుతారన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, ఐక్యూఏసీ కో- ఆర్డినేటర్ డాక్టర్ జి.కృష్ణవేణి, కంప్యూటర్ల విభాగాధిపతి పి. రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 31 , 2024 | 12:07 AM