గుండెపోటుతో టీడీపీ నేత అన్నే రామకృష్ణ మృతి
ABN, Publish Date - Jul 15 , 2024 | 01:12 AM
గొల్లపూడికి చెందిన టీడీపీ నేత అన్నే రామకృష్ణ(రాము)(54) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.
నేడు గొల్లపూడిలో అంత్యక్రియలు
గొల్లపూడి, జూలై 14: గొల్లపూడికి చెందిన టీడీపీ నేత అన్నే రామకృష్ణ(రాము)(54) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం గుండెపోటు రావ డంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆయన అర్ధరాత్రి తుదిశ్వాస విడిశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సోమవారం గొల్లపూడిలో ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
చంద్రబాబు, లోకేశ్ సంతాపం
అన్నే రామకృష్ణ అకాల మరణంపై సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ దిగ్భారంతిని వ్యక్తం చేశారు. టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభా గంలో సమర్థవంతంగా పనిచేసిన రామకృష్ణను ఓటర్ రామకృష్ణ అని పిలిచే వారని చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. రామకృష్ణ కుటుం సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామకృష్ణ మృతి తనను కలచి వేసిందని, టీడీపీ కోసం రామకృష్ణ అహర్నిశలు కష్టపడే వారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Updated Date - Jul 15 , 2024 | 01:12 AM