పోలంపల్లి నుంచి సాగునీరు విడుదల
ABN, Publish Date - Jul 19 , 2024 | 12:34 AM
పోలంపల్లి ఆనకట్ట పటిష్ట నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు.
సాగునీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
వత్సవాయి, జూలై 18: పోలంపల్లి ఆనకట్ట పటిష్ట నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. పోలంపల్లి మునేరు కాల్వకు సాగునీటిని గురువారం విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈఏడాది మునేరు పరిధిలోని రైతులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామన్నారు. 25 వేల ఎకరాలు సాగుకు పుష్కలంగా సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వడ్లమూడి రాంబాబు, కోటారు సత్యనారాయణ ప్రసాద్, యార్లగడ్డ విశ్వనాథం, కిలారు విశ్వనాథ్, మండెపూడి చంద్రశేఖర్, ఈఈ గంగయ్య, డీఈ గోపినాథ్ పాల్గొన్నారు.
Updated Date - Jul 19 , 2024 | 12:34 AM