ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:55 AM

తోట్లవల్లూరు బందరు కాలువ వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆకునూరు ప్రవీణ్‌(25) దుర్మరణం చెందాడు.

తోట్లవల్లూరు, ఏప్రిల్‌ 15: తోట్లవల్లూరు బందరు కాలువ వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆకునూరు ప్రవీణ్‌(25) దుర్మరణం చెందాడు. తోట్లవల్లూరు శివారు అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ప్రవీణ్‌ తల్లిదండ్రులు గంగాధర్‌, మరియమ్మ కంకిపాడు మండలం కాసరనేనివారిపాలెంలో స్థిరపడ్డారు. ఆదివారం తోట్లవల్లూరులో నిర్వహించిన అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రవీణ్‌ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని రాత్రి 12 గంటల సమయంలో బైక్‌పై ఉయ్యూరు వెళుతూ వంతెన వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఎడ్లబండి లేదా ట్రాక్టర్‌ను గాని ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రవీణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.విశ్వనాథ్‌ తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 12:55 AM

Advertising
Advertising