ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ అక్రమాలపై నిగ్గుతేలుస్తాం: జీవీ

ABN, Publish Date - Jun 08 , 2024 | 01:09 AM

ఐదేళ్లుగా వైసీపీ నాయకులు చేసిన అక్రమాలపై నిగ్గు తేల్చుతామని ఎమ్మెల్యేగా గెలిచిన జీవీ ఆంజనేయులు అన్నారు.

కేక్‌ కట్‌చేస్తున్న జీవీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు

వినుకొండ, జూన్‌ 7: ఐదేళ్లుగా వైసీపీ నాయకులు చేసిన అక్రమాలపై నిగ్గు తేల్చుతామని ఎమ్మెల్యేగా గెలిచిన జీవీ ఆంజనేయులు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవీ ఆంజనేయులును శుక్రవారం కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలతో ముచెత్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి జీవీ నివాసానికి భారీగా తరలివచ్చి అభిమానులతో నివాస గృహం సందడిగా మారింది. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ జగన్‌ ఐదేళ్లపాటు వ్యవస్ధలను సర్వనాశనం చేశారని వాటిని చక్కదిద్దటం మా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అన్నారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ చెప్పినట్లు తప్పుచేసిన అధికారులను వదిలి పెట్టేది లేదని, తప్పు చెయ్యనివాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రత్యేకించి లోకేశ్‌ యువగళం పాదయాత్రలో ప్రస్తావించిన రెడ్‌ బుక్‌లో ఉన్న వారందరూ చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దారితప్పిన అధికారులందరికు తమ ప్రభుత్వంలోకి నోఎంట్రీ అన్నారు. ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి హైదరాబాద్‌ నివాసంలో సోదాలు, కూటమి ప్రభుత్వం ఎలా ఉండబోతుందో అనడానికి ఇది టీజర్‌ మాత్రమేనని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెబుతున్నట్లు ఐదేళ్లుగా వైసీపీచేసిన ల్యాండ్‌, శాండ్‌, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాల మొత్తం నిగ్గు తేల్చి తీరుతామన్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ కూడా మొదటి నుంచి అదే చెబుతున్నారని జీవీ గుర్తుచేశారు. ఐదేళ్ల అరాచకాలకు సంబంధించి ఫైళ్లు మాయంచేసి, ఆధారాలు ధ్వంసంచేసి సాక్ష్యాలు చెరిపేసి తప్పించుకుని పోదామంటే కుదరదన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంతోనే ప్రజా రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణ ప్రతిష్ట జరగనున్నదని తెలిపారు. ఆంధ్రుల కలల రాజధాని ప్రపంచస్థాయి నగరంగా, అవకాశాల స్వర్గంగా, సర్వాంగ సుందరంగా అమరావతి రూపుదిద్దుకోబోతుందన్న మాటే ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. పోలవరం పూర్తి, నదుల అనుసంధానంతో రాష్ట్రమంతా జలసవ్వడులు కూడా త్వరలోనే ఖాయంగా చూస్తామన్నారు. వరికపూడిశెల, పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ పూర్తి చేసుకునే సదవకాశం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలు అందించిన అద్భుత విజయంతో కేంద్రంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించే అవకాశం రావడం ఈ కలల సాకారానికి ఉపకరించనుందన్నారు. కేంద్రంలో మరోసారి చంద్రబాబు కింగ్‌ మేకర్‌ పాత్రను రాషా్ట్రభివృద్ధికి వినియోగించుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను ప్రజాపాలన వేదికలుగా మార్చుతామని తెలిపారు.

శివాలయంలో లీలావతి ప్రత్యేక పూజలు

వినుకొండ టౌన్‌, జూన్‌ 7: జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా పట్టణంలోని బాల గంగా పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం జీవీ ఆంజినేయలు సతీమణితో పాటు తెలుగుదేశం పార్టీ మహిళ నాయకులు, కార్యక్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. గంగా పార్వతి అమ్మవారితో పాటు, రామలింగేశ్వరస్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా 101 కొబ్బరికాయలుకొట్టి మొక్కులు తీర్చు కున్నారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను అందచేశారు.

Updated Date - Jun 08 , 2024 | 01:09 AM

Advertising
Advertising