ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆశీర్వదించండి.. పశ్చిమ ప్రజల రుణం తీర్చుకుంటా

ABN, Publish Date - May 12 , 2024 | 12:41 AM

మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి తనను ఆశీర్వదిస్తే, అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి కోరారు.

గళ్లా మాధవికి ఆడబిడ్డ లాంఛనంగా చీరె పెడుతున్న పశ్చిమ ప్రజలు

గుంటూరు, మే 11(ఆంధ్రజ్యోతి): మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సైకిల్‌ గుర్తు పై ఓటు వేసి తనను ఆశీర్వదిస్తే, అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గళ్లా మాధవి కోరారు. గుంటూ రు 36వ డివిజన బంజారా కాలనీలో శనివారం ఆమె ఎస్టీలతో ఆత్మీ య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుంటూరు పశ్చిమలో ఈసారి జరగబోతున్న ఎన్నికలు అత్యంత కీలక మని, కుళ్ళు, కుతంత్రాలతో ప్రజల రక్తాన్ని డబ్బుల రూపంలో పీల్చే జలగ మాదిరి వైసీపీ అభ్యర్థి పోటీలో ఉన్నదని హెచ్చరించారు. మాయమాటలతో, సోషల్‌ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి గెలవాలని చూసే వైసీపీ అభ్యర్థి రజినికి ఓటు వేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చిలకలూరిపేట ప్రజలను చూసిన ప్రపంచానికి తెలుసన్నారు. ప్రజలనే నమ్ముకొని తాను ముందుకు వచ్చానని, వైసీపీ నేతలు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా, అభివృద్ధి, సంక్షేమం, రక్షణ కోసం సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించా లని కోరారు. నియోజకవర్గం ప్రతి వీధిలో సీసీ రోడ్డు, స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి పేదవానికి సొంత ఇంటి కలను సాకారం చేసే విధంగా తాను పని చేసి తీరుతానని గళ్లా మాధవి హామినిచ్చారు.

Updated Date - May 12 , 2024 | 12:41 AM

Advertising
Advertising