అమరావతి ఔటర్ రింగ్రోడ్డుకు పచ్చజెండా
ABN, Publish Date - Jul 11 , 2024 | 03:36 AM
అమరావతి ఔటర్ రింగ్రోడ్డుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. మొత్తం 189 కిలోమీటర్ల పరిధిలో రూ.25వేల కోట్ల వ్యయంతో చేపట్టేందుకు నిర్ణయించింది.
25వేల కోట్లతో నిర్మాణానికి కేంద్రం అంగీకారం: పురందేశ్వరి
విజయవాడ, జూలై 10(ఆంధ్రజ్యోతి): అమరావతి ఔటర్ రింగ్రోడ్డుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. మొత్తం 189 కిలోమీటర్ల పరిధిలో రూ.25వేల కోట్ల వ్యయంతో చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో రానున్న కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు భారీగానే కేటాయింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది.
Updated Date - Jul 11 , 2024 | 07:41 AM